తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

-

ఏపీ, తెలంగాణల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన.. చెడుపై మంచి గెలుపునకు దీపావళి ప్రతీకగా నిలుస్తుందన్నారు. సర్వమతాల వారు ఆనందంగా జరుపుకునే పండుగా దీపావళి అంటూ వివరించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో దీపావళి జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రులు…

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందంగా దీపావళి జరుపుకోవాలని తెలంగాణ  తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడ ఉన్న ఐక్యతను చాటే విధంగా ఉంటూ మన జీవితంలో కమ్ముకున్న చీకట్లు తొలగేలా దీపావళి వెలుగులు నింపాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news