త్వరలో రాజకీయాల్లోకి వస్తా… ప్రభోదానంద

-

జేసీ దివాకర్ రెడ్డి సోదరులను ఎదురించడానికి త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రభోదానంద వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ… జేసీ సోదరులు తన దగ్గరి నుంచి అధిక మొత్తంలో డబ్బులు ఆశించారు..తాను ఇబ్చెందుకు నిరాకరించడంతో కావాలనే తనపై క్షక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.1993 నుంచి ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నారని అనంతలో వారి చేష్టలు పెరిగిపోయాయని ప్రభోదానంద వెల్లడించారు. వారికి ధీటుగా త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ఆయన ప్రకటించారు.

తనను దెబ్బతీయాలనే ఆలోచనతోనే స్థానిక గ్రామస్తులను రెచ్చగొట్టి భక్తులపై దాడులు చేయిస్తున్నారన్నారు. డేరా బాబా అంటూ తనపై ఆరోపణలు చేయడం చాలా బాధాకరం.. తాము ఎప్పుడు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఆశ్రమం చుట్టూ, ఆశ్రమంలో సీసీ కెమెరాలు పెట్టించామని ఎలాంటి తప్పుచేయడం లేదని ప్రభోదానంద వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news