నేడు న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు…

-

ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్ర‌వారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ విందు ఇవ్వనున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో ఈరోజు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎల్బీ స్టేడియం ప‌రిస‌ర ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అత్య‌వ‌స‌ర ప్ర‌యాణాల‌కు కొన్ని ప్ర‌త్యామ్నాయ మార్గాలు చూసుకోవాల‌ని పోలీసులు తెలిపారు.

ఆబిడ్స్‌ నుంచి వచ్చే వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రి మీదుగా చాపెల్‌రోడ్‌ వైపు మళ్లిస్తారు.
ఏఆర్‌ పెట్రోల్‌ బంక్ కూడలి నుంచి బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి, చాపెల్‌రోడ్‌ వైపు మళ్లిస్తారు.
ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను లిబర్టీ వైపు ,

ఉప రాష్ట్రపతి రాక‌తోనూ…


ఉప రాష్ట్ర‌ప‌తి వెంకయ్యనాయుడు ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం కోసం ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి రానున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పంజాగుట్ట ఫ్లై ఓవర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకుంటారు. దీంతో ఆయా మార్గంలో ట్రాఫిక్ మ‌ళ్లింపు ఉండ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news