పాక్ లో బాంబ్ బ్లాస్ట్.. ఆదేశ జాతిపితకే అవమానం

-

ఉగ్రవాదుల స్వర్గధామంగా ఉండే పాకిస్థాన్ కే అక్కడ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు చుక్కలు చూపిస్తున్నారు. వరసగా దాడులు చేస్తూ పాక్ కు నిద్ర లేకుండా చేస్తున్నారు. తాజాగా ఆదేశ జాతిపిత ఖైద్-ఎ-ఆజామ్ మహ్మద్ ఆలీ జిన్నా విగ్రహాన్నే టార్గెట్ చేశారు. బలూచిస్థాన్లోని పోర్ట్ సిటీ అయిన గ్వాదర్ లోని జిన్నా విగ్రహాన్ని బాంబులతో కూల్చివేశారు. గత జూన్ లోనే అక్కడి ప్రభుత్వం విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. టూరిస్ట్ ముసుగులో వచ్చిన బెలూచ్ ఆర్మీ సభ్యుడే ఘాతుకానికి పాల్పడ్డాడని అక్కడి అధికారులు తెలుపుతున్నారు. జిన్నా విగ్రహంపై దాడి అంటే పాకిస్థాన్ ఐడలాజిపై జరిగిన దాడిగా అక్కడి రాజకీయ నేతలు అభివర్ణిస్తున్నారు. బెలూచిస్థాన్ స్వతంత్రత కోసం అక్కడ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎప్పటి నుంచో పోరాడుతోంది. ఇటీవల కాలంలో జరిగిన మరో బాంబ్ బ్లాస్ట్ లో నలుగురు అధికారులను మట్టుబెట్టింది. పాక్ ప్రభుత్వం, సైన్యం బెలూచ్ ప్రజలను హింసిస్తోొందని, అక్కడి ప్రజల స్వతంత్ర కాంక్షను అణగదొక్కుతుందని సదరు సంస్థ ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తోంది. అయితే పాకిస్థాన్ మాత్రం భారత్ ప్రోద్భలంతోనే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రఘటనలకు పాల్పడుతుందని ఎప్పుడూ అసత్య ఆరోపణలు చేస్తూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news