పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా..రాజగోపాల్ రెడ్డి

-

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఏదో ఆవేశంలో మాట్లాడిన విషయాన్ని ఇంత రాద్దాంతం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల  పవనాలు వీస్తున్నాయి.. గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇస్తే అధికారంలోకి రావాడం సులభం అవుతుంది అన్నారు. ఇటువంటి సమయంలో ఏ ఒక్క చిన్న తప్పు చేసినా కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కలుగుతుందన్నారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీలను రాష్ట్ర నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ ఐదేళ్లలో కాంగ్రెస్‌ కార్యకర్తలపై ఎన్నోకేసులు పెట్టి వేధించారని, అయినా పార్టీ కోసం కార్యకర్తలు.. తను కష్టపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి ఎమ్మెల్యే సీటు ముఖ్యమేనని, గెలిచే అభ్యర్థులకే టికెట్‌ ఇవ్వాలన్నారు. తొలి షోకాజ్‌ నోటీసుకే సమాధానం ఇచ్చానని, రెండోసారి నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news