పొత్తుల దిశగా దూకుడు పెంచిన తెలంగాణ తెదేపా

-

తెలంగాణలో తమ ఉనికిని చాటుకోవడం కోసం ఇతర పార్టీలతో పొత్తుల కోసం తహతహలాడుతున్న తెలంగాణ తెలుగు దేశం పార్టీ దూకుడు పెంచింది. శని , ఆది వారాల్లో తెదేపా అధినేత చంద్రబాబుతో తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ సంప్రదింపులు జరిపి మూడు కమిటీలుగా ఏర్పడాలని నిర్ణయం తీసుకున్నారు. వీటిలో ఎన్నికల సమన్వయ కమిటీగా ఎల్ రమణ ఆధ్వర్యంలో సీనియర్ నేతలు దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వరరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్ది రెడ్డి, రేవూరి, మండవ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇతర పార్టీలతో పొత్తుల గురించి ఈ నేతలు సంప్రదింపులు జరపనున్నారు. దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టోని రూపొందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news