ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశాభివృద్ధి శూన్యం: సీతక్క

-

భారతీయ జనతా పార్టీపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదని మంత్రి సీతక్క  విమర్శించారు. బీజేపీ పాలనలో అక్షింతలు, రామమందిరం, పూల్వామా దాడి ఘటనలు తప్పా.. అభివృద్ధి శూన్యమని అసహనం వ్యక్తం చేశారు.

నిర్మల్ జిల్లా భైంసాలో ముధోల్ అసెంబ్లీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశములో మంత్రి సీతక్క మాట్లాడుతూ….కాంగ్రెస్ ప్రభుత్వం తల్లీబిడ్దల పాలనను మంత్రి సీతక్క అందిస్తుందన్నారు. మహిళ సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యత ఇస్తుందని.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు సైనికుల్లా పని చేయాలని వెల్లడించారు.దేశంలో కాంగ్రెస్ తోనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని ,బీజేపీ పాలనలో కార్పొరేట్ సంస్థలకు తప్పా.. పేదలకు సంక్షేమం జీరో అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news