మంత్రి అంబటి రాంబాబు: శంకుస్థాపన తప్ప పూర్తి చేయడం తెలియదు చంద్రబాబుకు

-

పవన్ కళ్యాణ్ వివాదం మీద మంత్రి అంబటి రాంబాబు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఇక్కడ ఈయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ .. చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబూ నువ్వు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నావు కదా , పోవడం గురించి ఏమి చేశావు అంటూ రాంబాబు ప్రశ్నించారు. ఇక ఎప్పుడూ చెప్పుకునే నదుల అనుసంధానం చేయడం వలన ఏమి సాధించారు అని ఫీలవుతున్నారు అంటూ సూటిగా అడిగారు మంత్రి అంబటి. ఈ రోజున చంద్రబాబు లాంటి వ్యక్తి తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారంటూ కామెంట్లు చేశారు అంబటి. నువ్వు ప్రాజెక్టులు చూడడానికి వెళుతున్నావు కదా … ఎప్పుడూ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు అన్నీ కూడా వైఎస్ హయాంలో పూర్తి చేసినవే చంద్రబాబు అంటూ వాస్తవాన్ని తెలుసుకునేలా కామెంట్ చేశారు మంత్రి.

నీ జీవితమంతా శంకుస్థాపనలు చేయడమే తప్ప పూర్తి చేయడం ఎక్కడ తెలుసు అంటూ మాట్లాడారు అంబటి రాంబాబు. కాగా చంద్రబాబు పవన్ తో కలిసి రాయలసీమ జిల్లాలలో శంకుస్థాపన చేసి ఆపేసిన ప్రాజెక్టులను సందర్శించడానికి వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news