మరో 3రోజులు రాధే శ్యామ్ షూటింగ్..అక్కడ భారీ సెట్..!

-

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ విడుదల కూడా వాయిదా పడుతోంది. ముఖ్యంగా కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అంతేకాకుండా సినిమా అవుట్ పుట్ అనుకున్నట్టుగా రాలేదని కొన్ని సీన్లు కూడా రీషూట్ చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమా కోసం మరో భారీ సెట్ వేసినట్టు తెలుస్తోంది. మూడు రోజులపాటు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే కేవలం టైటిల్ కార్డు కోసమే ఈ షూటింగ్ లో ప్లాన్ చేసినట్లు గండి కోట వద్ద భారీ సెట్ వేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు జిల్ సినిమా ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పిరియాడికల్ ప్రేమకథ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news