మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభ పరిణామం: మంత్రి కొల్లు రవీంద్ర

-

ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభపరిణామని గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ఐదు సంవత్సరాలు ఇసుకను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ..ఇకపై ఎవరికి ఇసుక కావాలన్నా సులభంగా అందేలా చూస్తాం. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు 9 నెలల పాటు ఎవరికీ ఇసుక దక్కలేదు అని తెలిపారు. 40 రంగాలు వారు దీనిపై ఆధారపడ్డారనే విషయాన్ని పట్టించుకోలేదు అని మండిపడ్డారు. లక్షలాది మంది జీవనోపాధి కోల్పోయారు. నిధులు దోచుకోవాలనే ఉద్దేశంతో జేపీ సంస్థను తెర మీదకు తీసుకొచ్చారు అని విమర్శించారు. తర్వాత రకరకాలుగా దోపిడీకి పాల్పడ్డారు. ఎన్జీటీ వరకు ఈ వ్యవహారం వెళ్లింది అని తెలిపారు.

 

వర్షాకాలంలో కూడా ఇసుక లభ్యత ఉండేలా చూస్తాం అని హామీ ఇచ్చారు. ఇసుక లోటు రాకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉచిత ఇసుక పంపిణీకి సంబంధించి విధి విధానాలు తయారు చేస్తున్నాం అని వెల్లడించారు.ఎవరైనా బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం అని వార్నింగ్ ఇచ్చారు . ఇసుక పంపిణీపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. 2014-19 కాలంలో ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమే. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని దోచుకోవడానికి వాడుకుంది. ఈ విధానంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం” అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news