త్వరలోనే మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

-

మెదక్ ఎంపీ రఘునందన్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల చివర్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే నాటికి మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని బాంబ్ పేల్చారు. మరో 15 నెలల వరకు అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా..? అని షాకింగ్ కామెంట్స్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అడుగులు తడబడుతున్నాయని పేర్కొన్నారు.  అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, కమీషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని ఈ సందర్భంగా రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఐదు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. ఈ సమయం మొత్తం రాజకీయాల గురించే తప్ప.. రాష్ట్ర అభివృద్ధికి కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news