మాచ‌ర్ల‌లో అత్తాపూర్ త‌ర‌హా హ‌త్య‌

-


అమ‌రావ‌తి (గుంటూరు): ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని అత్తాపూర్‌లో రోడ్డుపై న‌రికి చంపిన సంఘ‌ట‌న మ‌రిచిపోక ముందే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ అలాంటి సంఘ‌ట‌న చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మాచర్లలో ఈ దారుణ హత్య కలకలం రేపుతోంది. మాచర్ల మార్కెట్ యార్డు వద్ద ప్రేమ్ అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఏడుగురు దుండగులు గొడ్డలితో నరికిచంపారు. మృతుడు చెరుకుపల్లికి చెందిన ప్రేమ్‌కుమార్‌గా గుర్తించారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.గతంలో ఓ హత్య కేసులో హతుడు ప్రేమ్‌కుమార్‌కు యావజ్జీవ శిక్ష పడింది. ప్రేమ్ హత్యకు పాత కక్షలే కారణమని స్థానికులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news