అమరావతి (విశాఖపట్నం) : అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు టీడీపీ నేతలే కారణమని స్పష్టమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీటీసీలు, గ్రామ స్థాయి నాయకుల సాయంతోనే కిడారి హత్యకు మావోయిస్టులు ప్రణాళిక రచించారని టీడీపీ అనుబంధ పత్రికల్లోనే వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు ఈ హత్యలకు వైఎస్సార్సీపీకి ముడిపెట్టాలని కుటిల ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ టీడీపీ నాయకులే ఈ హత్యకు కారణమయ్యారని తేలిందన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులను తుది ముట్టించడంలో ఆరితేరారన్నారు. గతంలో వంగవీటి రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందని హరిరామ జోగయ్య స్పష్టం చేశారని గుర్తు చేశారు.మైనింగ్ గొడవల వల్లనే టీడీపీ స్థానిక నేతలు మావోయిస్టులతో చేతులు కలిపారని తేలిందన్నారు.
కిడారి హత్యకు టిడిపి నేతలే కారణం : భూమన
By ramu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం.. రెండు షాపులు, 10 ద్విచక్ర వాహనాలు దగ్ధం..!
హైదరాబాద్ లో కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించి.. రెండు షాపులు,...
Anji N -
విజయ్ మాల్యా వస్తే మాకు అప్పగించండి.. ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యాపై...
జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదాను మర్చిపోయారు: వైఎస్ షర్మిల
తిరువూరులో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ...