కిడారి హ‌త్య‌కు టిడిపి నేత‌లే కార‌ణం : భూమ‌న‌

-

అమ‌రావ‌తి (విశాఖపట్నం) : అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు టీడీపీ నేతలే కారణమని స్పష్టమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీటీసీలు, గ్రామ స్థాయి నాయకుల సాయంతోనే కిడారి హత్యకు మావోయిస్టులు ప్రణాళిక రచించారని టీడీపీ అనుబంధ పత్రికల్లోనే వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు ఈ హత్యలకు వైఎస్సార్‌సీపీకి ముడిపెట్టాలని కుటిల ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ టీడీపీ నాయకులే ఈ హత్యకు కారణమయ్యారని తేలిందన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులను తుది ముట్టించడంలో ఆరితేరారన్నారు. గతంలో వంగవీటి రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందని హరిరామ జోగయ్య స్పష్టం చేశారని గుర్తు చేశారు.మైనింగ్ గొడవల వల్లనే టీడీపీ స్థానిక నేతలు మావోయిస్టులతో చేతులు కలిపారని తేలిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news