ఇటీవల విశాఖ మన్యంలో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్య కేసు ఏపీ పోలీస్ శాఖ ఛాలెంజ్ గా తీసుకుంది. హత్యకు సంబంధించి అన్ని కోణాల్లో చేపట్టిన దర్యాప్తులో పురోగతి సాధించామని డీజీపీ తెలిపారు. మావోయిస్టులకు పోలీస్ పవర్ ఎలా ఉంటుందో త్వరలోనే చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. లివిటిపుట్టు దాడిలో ఎవరెవరు పాల్గొన్నారో, వారికి ఎవరు సహకరించారో, ఏ మార్గాల్లో వచ్చారో కూడా గుర్తించినట్టు వెల్లడించారు. దాడిలో ఎక్కువగా ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి పాల్గొన్నారని, అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు.. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులకు గట్టి భద్రత కల్పించామని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ఊరుకోం వారికి తగిన కౌంటర్ ఇచ్చితీరుతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.
మావోలకు పోలీస్ పవర్ చూపిస్తాం…డీజీపీ
-
Read more RELATEDRecommended to you
పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి : సీఎం జగన్
పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ఏపీ సీఎం...
Anji N -
మోదీని గెలిపిస్తే రెండేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారతాం: జేపీ నడ్డా
దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ.. బీజేపీ అని ఆ పార్టీ...
ముస్లిం లే ఎక్కువ కండోమ్స్ వాడుతారు : ఒవైసీ
ముస్లింలను ఉద్దేశించిన ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం...
Anji N -