పట్టపగలే రోడ్డుమీద వృద్ధుడిపై దాడి చేసి దోచుకున్నారు.. వీడియో

-

ఢిల్లీలోని జానక్‌పురి ఏరియాలో దారుణం చోటు చేసుకున్నది. పట్టపగలే ఓ వృద్ధుడిని ఇద్దరు దుండగులు దోచుకున్నారు. వృద్ధుడి గొంతును చేయితో ఓ వ్యక్తి పట్టేయగా.. మరో వ్యక్తి వృద్ధుడి పర్సు, మొబైల్‌ను తస్కరించాడు. అనంతరం ఆ వృద్ధుడిని అక్కడే వదిలేసి పారిపోయారు ఆ దుండగులు. సీసీటీవీలో రికార్డయిన ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాయంత్రంలోగా ఇద్దరు దుండగులను కటకటాల్లోకి నెట్టారు.

(Video Courtesy: The Times Of India)

Read more RELATED
Recommended to you

Latest news