మిట్టమధ్యాహ్నం యువకుడి దారుణ హత్య

-

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం మిట్టమధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. ప్రణయ్ కుమార్ అనే వ్యక్తిని ఓ  ఆసుపత్రి ఎదుట దుండగుడు కత్తితో నరికి చంపాడు. ప్రణయ్ కుమార్, అమృత వ‌ర్షిణి ప్రేమించుకుని ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. వైవాహిక జీవితాన్ని సంతోషంగా సాగిస్తున్నారు. భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా  ఊహించని రీతిలో ఓ దుండగుడు కత్తితో అత్యంత దారుణంగా ప్రణయ్ మెడపై విచక్షణ రహితంగా పొడిచాడు. దీంతో అక్కడిక్కడే బాధితుడు ప్రాణాలు కొల్పోయాడు. భార్య దారుణాన్ని చూసి తట్టుకోలేక భయంతో పరుగులు పట్టింది. మిట్ట మధ్యాహ్నం జరిగిన ఈ హత్య మిర్యాలగూడెంలో కలకలం రేపింది. ప్రేమ వివాహాన్ని నచ్చని అమ్మాయి తరుఫున బంధువులే అతని పై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news