నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం మిట్టమధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. ప్రణయ్ కుమార్ అనే వ్యక్తిని ఓ ఆసుపత్రి ఎదుట దుండగుడు కత్తితో నరికి చంపాడు. ప్రణయ్ కుమార్, అమృత వర్షిణి ప్రేమించుకుని ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. వైవాహిక జీవితాన్ని సంతోషంగా సాగిస్తున్నారు. భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ఊహించని రీతిలో ఓ దుండగుడు కత్తితో అత్యంత దారుణంగా ప్రణయ్ మెడపై విచక్షణ రహితంగా పొడిచాడు. దీంతో అక్కడిక్కడే బాధితుడు ప్రాణాలు కొల్పోయాడు. భార్య దారుణాన్ని చూసి తట్టుకోలేక భయంతో పరుగులు పట్టింది. మిట్ట మధ్యాహ్నం జరిగిన ఈ హత్య మిర్యాలగూడెంలో కలకలం రేపింది. ప్రేమ వివాహాన్ని నచ్చని అమ్మాయి తరుఫున బంధువులే అతని పై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
మిట్టమధ్యాహ్నం యువకుడి దారుణ హత్య
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
నల్గొండ లో గెలిచి చరిత్ర సృష్టిస్తా.. బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి
నల్గొండ ఎంపీ అభ్యర్థిగా గెలిచి చరిత్ర సృష్టిస్తానని బీజేపీ అభ్యర్థి శానంపూడి...
Anji N -
8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి వస్తారు -కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి వస్తారంటూ తెలంగాణ రాష్ట్ర...
ఈ వయస్సులో పార్టీ మారడానికి సిగ్గుండాలన్న రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పోస్ట్ వైరల్
పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కీలక నేతలంతా పార్టీని...
Anji N -