విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్లే వారికి అలర్ట్..కొత్త టైమింగ్స్ ఇవే

-

విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్లే వారికి బిగ్ అలెర్ట్.విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రికి వీఐపీలు, వికలాంగులు, వృద్ధులు 11:30am నుంచీ 1:30pm మధ్య దర్శనానికి రావద్దు అని తెలిపారు. 11:45 నుంచీ 12:45 వరకూ మహానివేదన కనుక దర్శనం నిలిపివేయబడును.

ఆ సమయంలో ప్రత్యేక‌ దర్శన ఏర్పాటు ఉండదు. కనుక పై నిబంధన పాటించగలరు.ఆలయ ఆచారంగా వస్తున్న మహానివేదన సమయంలో ఈ సూచనను వీఐపీలు, వికలాంగులు, వృద్ధులు పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news