విజయవాడ సెంట్రల్ టికెట్ వంగవీటికి ఇవ్వలేం..అంబటి

-

విజయవాడ సెంట్రల్ టికెట్ వంగవీటి రాధకు ఇవ్వడం లేదంటూ వైసీపీ తెల్చేసింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్నిఅందరూ పాటించాలని రాంబాబు కోరారు. ఆదివారం జరిగిన సమావేశంలోనే టికెట్ విషయమై రాధకు క్లారిటీ ఇచ్చామన్నారు. అయితే రాధా మాత్రం సెంట్రల్ నుంచే పోటీచేస్తానని ప్రకటించి సమావేశం మధ్యలో నుంచి బయటకు వచ్చారు. నాటి నుంచి వారి అనుచరులు ఈ విషయమై నిరసన తెలుపుతున్నారు.

ఆందోళన కార్యక్రమాల్లో రాధా పాల్గొని మరో రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పడంతో.. వైసీపీ ఆయనకు టికెట్ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది.  ఎప్పటి నుంచో వైసీపీని నమ్ముకుని ఉన్న రాధాని కాదని ఏడాది క్రితం పార్టీలోకి వచ్చిన వారికి   విజయవాడ సెంట్రల్లో  పార్టీ సమన్వయ కర్తగా మల్లాది విష్ణుకి బాధ్యతలు అప్పగించడాన్ని రాధా అనుచరులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news