విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీలకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

-

ఉద్యోగుల పరస్పర బదిలీ( మ్యూచువల్ ట్రాన్స్ ఫర్) లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరస్పర బదిలీల కింద ఉపాధ్యాయులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన వెంటనే.. విద్యాశాఖలో ఉపాధ్యాయుల మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని ఆ శాఖ అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

పరస్పర బదిలీలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రంలోని 2,558 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రయోజనం లభించనుంది. విద్యాశాఖ మంత్రి ఆదేశాలతో ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ఒకటి, రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news