సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

-

సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఐదు జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కరీంనగర్,నల్లగొండ,ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల నేతలు భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి.. నియోజకవర్గాల్లో నిజాయతీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలని తెలిపారు.అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదని అన్నారు.

అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావులేదని అని చెప్పారు .ప్రతీ నియోజకవర్గానికి రూ.10కోట్ల స్పెషల్ డెవలెప్‌మెంట్‌ నిధుల బాధ్యత ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులకు అప్పగిస్తున్నామన్నారు. ఇన్‌చార్జి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోని సమస్యలను పరిష్కరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు .పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లి లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 12 స్థానాలు తగ్గకుండా గెలవాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news