సీఎం రేవంత్ ఒక్క ఆర్టీసీ బస్సు తప్ప ఏదీ ఇవ్వడం లేదు : ఈటెల రాజేందర్

-

రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నమ్మి ఆయనకు ఓటు వెయ్యలేదు. కేసీఆర్ మళ్ళీ వస్తే ప్రజాస్వామ్యం ఉండదేమో అనే భయంతో వేశారు అని ఈటెల రాజేందర్ అన్నారు. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఓబీసీ సదస్సుకు ముఖ్యఅతిథిగా ఈటల రాజేందర్ హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బీజేపీ మీద విషం చిమ్మి పెయిడ్ ఆర్టికల్స్ తో, మేనేజ్డ్ మీడియాతో ప్రజలను నమ్మించి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు అని విమర్శించారు.

ప్రజలను సూటిగా ఈ ప్రశ్నలు అడిగితే.. అప్పుడే వారికి కూడా అర్థం అవుతుంది అని ఆ సమావేశానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడారు.

మహిళకు 2500 రూపాయలు వస్తున్నాయా ?

4 వేల రూపాయల పెన్షన్ వస్తుందా ?

వికలాంగులకు 6 వేల పెన్షన్ వస్తుందా?

ఆడపిల్లలకు స్కూటీ వచ్చిందా?

కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం వస్తుందా?

ఆటోడ్రైవర్స్ కి 12 వేలు ఇస్తా అన్నారు ఇచ్చారా?

మహిళా సంఘాలకు 10 లక్షల రుణం ఇచ్చారా?

డబ్బులు ఖర్చులేని రేషన్ కార్డ్ కూడా ఇచ్చే దమ్ములేని సీఎం రేవంత్ ఒక్క ఆర్టీసీ బస్సు తప్ప ఏదీ ఇవ్వడం లేదు అని ఈటెల రాజేందర్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news