హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ కి ప్రమాదం

-

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దత్తాత్రేయకు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు దత్తాత్రేయ శంషాబాద్ ఎయిర్ ఫోర్టుకు బయలుదేరారు. కిషన్ గూడ ట్రంపెట్ వంతెన సమీపంలోకి రాగానే ఒక కారు అకస్మాత్తుగా కాన్వాయ్ లోకి దూసుకొచ్చింది.

దీంతో కాన్వాయ్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వల్ల కాన్వాయ్ లోని వాహనాలు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీ కొన్నాయి. అయితే ఈ ఘటనలో గవర్నర్ దత్తాత్రేయకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news