ఈ స్కీమ్ తో ప్రతి నెలా రూ.10 వేల పెన్షన్..!

-

చాలా మంది భవిష్యత్తు ని దృష్టి పెట్టుకుని ఆర్ధిక ఇబ్బందులేమీ రాకూడదని స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. ప్రతి నెలా కచ్చితంగా పెన్షన్ పొందాలని అనుకుంటే ఈ ప్లాన్ తీసుకోవచ్చు. ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్ తో ప్రతి నెలా కచ్చితంగా పెన్షన్ వస్తుంది. పూర్తి వివరాల లోకి వెళితే..

ప్రధాన్ మంత్రి వయ వందన యోజన లో డబ్బులు పెట్టడం వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ బాధ్యతలు చూసుకుంటోంది. ఇందులో డబ్బులు పెడితే సంవత్సరానికి 72 వేల రూపాయలు పొందవచ్చు.

భవిష్యత్తు ఆర్థికంగా సురక్షితంగా ఉండేందుకు కూడా ఈ స్కీమ్ హెల్ప్ అవుతుంది. 60 సంవత్సరాలు లేదా అంత కంటే ఎక్కువ వయస్సు ఉంటే పెట్టుబడి పై అనేక ప్రయోజనాలను పొందుతున్నారు. 7.40% వడ్డీని ఈ స్కీమ్ లో పెట్టడం వలన వస్తుంది. 10 సంవత్సరాల పాటు సంవత్సరానికి 7.40% వడ్డీని పొందొచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులని పెట్టడం వలన పదవీ విరమణ తర్వాత ఇంటి ఖర్చులను నిర్వహించడం చాలా కష్టం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news