తెలంగాణలో నేడు కొత్త‌గా 123 క‌రోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతుంది. రోజు రోజుకు క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుతూ వ‌స్తుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క‌రోనా బులిటెన్ ను విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం… గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 27,454 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. ఈ పరీక్ష ఫలితాల్లో.. 348 క‌రోనా పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి.

దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 7,89,676 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. కాగ ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కార‌ణంగా.. ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించలేదు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మ‌ర‌ణాలు 4,111 గానే ఉన్నాయి. కాగ గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 348 మంది బాధితులు క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌స్తుతం 1,939 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ రాష్ట్రంలో రిక‌వ‌రీ రేటు.. 99.23 శాతంగా న‌మోదు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news