పేపర్ లీకేజీ కేసు.. నిందితుల పెన్​డ్రైవ్​లో మరో 15 క్వశ్చన్ పేపర్లు

-

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ ఘటనలో ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్టు చేసి విచారిస్తోంది. ఈ క్రమంలోనే సిట్ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా ఈ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు నిందితుల పెన్​డ్రైవ్​లో 15 ప్రశ్నాపత్రాలు లభించాయి. ఏఈఈ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, డీఏవో పేపర్‌1, పేపర్‌ 2, ఏఈ జనరల్ స్టడీస్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఏఈ సివిల్, ఎలక్ట్రికల్, టౌన్ ప్లానింగ్ జేఎల్‌ , గ్రూప్-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాలను సిట్ అధికారులు గుర్తించారు.

మరోవైపు ఈ కేసులో నిందితులను మూడో రోజు సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ‘షమీమ్ కంప్యూటర్ నుంచి ప్రశాంత్‌రెడ్డికి .. గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్ పంపించాడు. ఎనీ డెస్క్ అప్లికేషన్‌ను షమీమ్ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసిన రాజశేఖర్… పెన్‌డ్రైవ్ ద్వారా సమాచారాన్ని చోరీ చేశాడు. తనపై నిఘా ఉండటంతో షమీమ్ కంప్యూటర్‌ను రాజశేఖర్ ఉపయోగించుకున్నట్టు’ పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news