మంత్రి అప్పలరాజుకు CMO నుంచి అత్యవసర పిలుపు

-

మంత్రి సీదిరి అప్పలరాజుకు అత్యవసర పిలుపు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం నుంచి ఆయనకి అత్యవసర పిలుపు రావడంతో శ్రీకాకుళం నుంచి హడావిడిగా బయలుదేరి వెళ్లారు. దీంతో నియోజకవర్గంలో ఆయన నేడు చేపట్టవలసిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతుందన్న నేపథ్యంలో ఆయనకు జగన్ నుంచి పిలుపు రావడం పార్టీలో చర్చనీయాంశమైంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసి వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఇప్పటికే రెండుసార్లు కేబినెట్ విస్తరణ జరిగింది. తొలి కేబినెట్ లో చోటు దక్కించుకున్న మంత్రుల్లో ముగ్గురు, నలుగురు మినహా మిగిలిన వారందరికీ రెండవ కేబినెట్లో అవకాశం రాలేదు. అయితే ఇప్పుడు మూడోసారి కూడా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news