12 ఎన్‌ కౌంటర్లు.. 33 మంది టెర్రరిస్టులు మృతి..!

-

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలోని చేవా ఉల్లార్ గ్రామంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య  కాల్పులు జరిగాయి. గురువారం సాయంత్రం మొదలైన ఈ ఎన్‌ కౌంటర్ శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. ముఖ్యంగా గురువారం రాత్రి టెర్రరిస్టులు, భద్రతా దళాలకు మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు జరిగాయని తెలిసింది. చేవా ఉల్లార్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేరకు జమ్మూకాశ్మీర్ పోలీసులు సైనిక జవాన్లతో కలిసి గాలింపు చేపట్టారు.

2 terrorists got encountered in kashmir soperi ambush

సైనికులు గాలింపు కొనసాగిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని పోలీసులు తెలిపారు. ఈ నెలలో సౌత్ కశ్మీర్‌‌ రీజియన్‌లో జరిగిన 12వ ఎన్‌ కౌంటర్ ఇది కావడం గమనార్హం. సెక్యూరిటీ ఫోర్సెస్ ఎదురుకాల్పుల్లో మొత్తం 33 మంది టెర్రరిస్టులు మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news