హై టెన్షన్ : బర్త్ డే పార్టీలో 2 మంత్రులు ఎమ్మెల్యేలు..! పార్టీలో 20 మదికి కరోనా..!

-

హైదరబాద్ లో ఓ బంగారు వ్యాపారి.. డబ్బు చాలా సంపాదించాడు పరిచయాలు బాగా ఉన్నాయి. తెలంగాణ మంత్రులు ఎమ్మేల్యేలు ఎమ్మెల్సీ లు అంతా ఈయనకు సన్నిహితులే..! కాగా గత నెల 22 న ఈయన పుట్టిన రోజు డబ్బు మనిషి కదా, పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకి తెలంగాణ ఎమ్మెల్సీ లు, ఎమ్మేల్యేలు, ఇద్దరు మంత్రులు హాజరయ్యారు వీరితో పాటే మరో 150 మంది సన్నిహితులు బంగారం వ్యాపారులు విందులో పాల్గొన్నారు.

అయితే విందుకు మర్నాటి నుంచే ఈయనకు దగ్గు జలుబు మొదలయ్యాయి. దగ్గరలోని డాక్టర్ వద్దకు వెళితే కొన్ని మందులు ఇచ్చాడు అవి ఏవి వాడిన దగ్గు జ్వరం తగ్గడం లేదు దాంతో ఐదు రోజులక్రితం ఆసుపత్రిలో చేరి కరోనా పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ అని తేలిన మారునాడే ఆ వ్యాపారి మరణించాడు. ఇక అదే పార్టీలో పాల్గొన్న మరో బంగారు వ్యాపారి కూడా రెండు రోజుల ముందు మరణించాడు. ఆ విందులో హాజరయిన 20 మందికి పైగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఇప్పుడు ఆ మంత్రులకు ఎమ్మెల్యేలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సీక్రెట్ గా వెళ్ళి కరోనా పరీక్షలు చేయించుకుంటున్నట్టుగా సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news