2024.. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ అక్కడి నుంచే.. అలీ..!

-

ఒకప్పుడు సినిమాలలో హాస్యనటుడిగా.. ఆ తర్వాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ అలీ ఆ తర్వాత కాలంలో సెలబ్రిటీ టాక్ షోలను నిర్వహించి.. హోస్ట్ గా కూడా తనదైన రీతిలో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వ నుంచీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవి రావడంతో ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి కూడా ఆయన గుడ్ బై చెప్పేసారు. ఇదిలా ఉండగా తాజాగా సోమవారం రాజమండ్రిలో జరిగిన ఒక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆలీ మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తానని తెలిపారు..

అంతేకాదు రాజమండ్రి నుండి తాను పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారం కేవలం ఒట్టి పుకారు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇక క్రికెట్ టోర్నీలో పాల్గొంటున్న ఆటగాళ్లు మంచి ప్రతిభ కనబరిచి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆలీ ఆకాంక్షించారు. అంతే కాదు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో కొన్ని వందల చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయని ఆయన స్పష్టం చేశారు.. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం ఆలీ సంచలన వ్యాఖ్యలు చేశారు ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి కూడా తాను సిద్ధమేనని ప్రకటించారు.

సీఎం ఆదేశిస్తే ఎవరిపైనైనా పోటీ చేస్తానని ఆలీ కామెంట్స్ చేశారు. ఇకపోతే రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారో ప్రజలకు బాగా తెలుసు అని.. విమర్శలు ప్రతి విమర్శలు చేయడం సాధారణమని.. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news