కాబోయేవాడికి ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా.. యువతి పోస్టు వైరల్

-

ఆర్థిక మాంద్యం టెక్కీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది కేవలం ఉద్యోగులపై మాత్రమే కాదు.. వారిపై ఆధారపడ్డ వారినీ తీవ్రంగా ప్రభావం చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు కాబోయేవాడికి ఉద్యోగం పోయిందని.. ఇప్పుడు అతణ్ని పెళ్లాడాలా వద్దా అని ఓ యువతి పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

‘కుటుంబ సభ్యులు మా ఇద్దరికీ వివాహం కుదిర్చారు. ఫిబ్రవరిలోనే ముహూర్తం నిర్ణయించారు. అంతలోనే నన్ను పెళ్లిచేసుకోబోయేవాడిని ‘మైక్రోసాఫ్ట్‌ ఇండియా’ ఉద్యోగంలోంచి తొలగించింది. నా కుటుంబానికీ ఈ విషయం తెలుసు. ఇప్పటికీ అతన్ని పెళ్లి చేసుకోవాలా? వద్దా? తెలియడం లేదు. అతన్ని పెళ్లాడొచ్చా? అతని వేతనం రూ.2.5 లక్షలుగా ఉండేది’ అని ఓ గుర్తుతెలియని యువతి ఓ సోషల్‌ యాప్‌ వేదికగా పోస్టు పెట్టారు. ఇది కాస్త ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

యువతి పోస్టుపై భిన్న స్పందనలు వస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన సంబంధాలు వ్యాపార లావాదేవీల్లా మారిన నేపథ్యంలో.. దీన్ని అలాగే పరిగణించాలని కొందరు స్పందించారు. అతనికి నీకంటే మంచి వ్యక్తి దొరుకుతారని మరికొందరు కామెంట్లలో చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news