భారతీయులకు అలర్ట్‌.. రెండ్రోజుల్లో 39 ప్రయాణికులకు కరోనా

-

యావత్తు ప్రపంప దేశాలను భయాందోళనకు గురి చేసిన కరోనా రక్కిసి మళ్లీ విజృంభిస్తోంది. అయితే.. ఇప్పటికే చైనాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దీంతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా మరోసారి కొవిడ్‌ ఆందోళనలు పెరుగుతున్నాయి. డ్రాగన్‌ కంట్రీ చైనా, జపాన్‌ సహా పలు దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ కట్టడి కోసం అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నది. అయితే, గడిచిన రెండురోజుల్లో భారత్‌కు వచ్చిన 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా సోకిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Covid-19 Updates: China में एक दिन 3.7 करोड़ लोग कोरोना पॉजिटिव, सड़कों और  मॉल में भारी भीड़ | Zee Business Hindi

ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించనున్నారు. ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం దాదాపు 6వేల మందికి ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించారు. ఎయిర్‌పోర్టులో వచ్చివెళ్లే ప్రయాణికులందరికీ ర్యాండమ్‌గా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news