కడప జిల్లాలో విషాదం.. ఏడుగురు జలసమాధి

-

కడప జిల్లా సిద్దవటం  వద్ద  పెన్నానదిలో  7 గురు యువకులు గల్లంతయ్యారు. నిన్న సరదాగా ఈతకని వెళ్ళి ప్రమాదవశాత్తు గల్లంతు అయ్యారు. నిన్నటి నుండి గజ ఈతగాళాళ్ళు, పోలీసులు రంగంలోకి దిగి గాలిస్తున్నారు. గల్లంతయిన వారు తిరపతి కొర్లకుంటకు చెందిన వారని సిద్దవటంలో ఫంక్షన్ కని ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారని తెలుస్తోంది. వేరులో ఇప్పటి వరకు 4 మృతదేహాలు లభ్యం అయ్యాయి.

మిగిలిన ముగ్గురి కోసం గజ ఈతగాళ్ళ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సిద్దవటంలో స్నేహితుడి ఇంట ఏడాది కర్మకాండ కార్యక్రమానికి వచ్చి ఈ 7 గు రు యువకులు జలసమాధి అయ్యారు. జలసమాధి అయిన వారిలో జగదీష్, తరుణ్, షణ్ముఖం, రాజేష్, సోమశేఖర్, జశ్వంత్, సతీష్ లు ఉన్నారు. దీంతో ఈ యువకుల సొంత ఊరు తిరుపతిలో విషాదచాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news