రాష్ట్రంలో భారీగా త‌గ్గిన క‌రోనా.. నేడు 453 కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి భారీగా త‌గ్గింది. నేడు రాష్ట్రంలో క‌రోనా కేసులు 500కు త‌క్కువ‌గానే న‌మోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేసిన క‌రోనా బులిటెన్ ప్రకారం.. గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్రంలో 453 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కాగ రాష్ట్రంలో బుధ‌వారం 512 కేసులు న‌మోదు అయ్యాయి. అంటే నిన్న‌టితో పోలిస్తే.. రాష్ట్రంలో 69 క‌రోనా కేసులు త‌గ్గాయి.

కాగ నేడు రాష్ట్ర వ్యాప్తంగా 41,310 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఒక్క‌రు కూడా మృతి చెంద లేదు. గ‌త రెండు రోజుల నుంచి రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం లేదు. కాగ‌ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల‌లో 1,380 మంది బాధితులు క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 6,746 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో క‌రోనా రిక‌వరీ రేటు కూడా కూడా భారీగా పేరుగుతుంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 98.62 శాతంగా క‌రోనా రిక‌వ‌రీ రేటు న‌మోదు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news