తెలంగాణలో మరో కిడ్నాప్.. టపాకాయలు కొనడానికి వెళ్తే !

-

తెలంగాణలో వరుస కిడ్నాప్ లు, మిస్సింగ్ కేసులు టెన్షన్ కలిగిస్తున్నాయి. కనీసం రోజుకు ఒక మిస్సింగ్ లేదా కిడ్నాప్ కేసు ఎక్కడో ఒక చోట నమోదు అవుతూనే ఉంది. తాజాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాలుడు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. సూర్యాపేట భగత్ సింగ్ నగర్‌ కు చెందిన ఐదేళ్ల పరికపల్లి గౌతమ్ నిన్న సాయంత్రం దీపావళి టపాసులు కొనుక్కోడానికి దగ్గర్లోని షాప్ కి వెళ్లాడు.

అయితే ఎంత సేపటికీ చిన్నారి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆ ప్రాంతం అంతా వెదికారు. అయితే గౌతమ్‌ సైకిల్‌ టపాసుల దుకాణం వద్ద ఉన్నా… చిన్నారి ఆచూకీ లేకపోవడంతో కిడ్నాపైనట్టు భావిస్తున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా ? ఉంటే బాలుడి కదలికలు ఏమైనా రికార్డ్ అయ్యాయా ? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news