500 బోనస్ అన్నరు అది బోగస్…కేసిఆర్ కి గోడువెళ్లబోసుకున్న రైతన్నలు

-

కేసీఆర్ బస్సును ఆపి నల్గొండ మండలం ఆర్జాలబాయి రైతన్నలు తమ గోడు వినిపించారు.ఐకేపీ సెంటర్ దగ్గర రైతులు గన్నీ బ్యాగుల ప్రదర్శన చేశారు.ఇరువై రోజులనుంచి కల్లాల్లో ఓడ్లుపోసుకొని కూసున్నామని ధాన్యం కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు.కరెంటు లేదని.. రైతు బతుకు అంతా ఆగమైందని కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు.మీరున్నప్పుడు నడి ఎండాకాలంల కూడా నీళ్లు మత్తళ్లు దునికేవి.

మీరు ఉన్నప్పుడే అప్పుడే మంచిగుండే సార్ …మల్లా మీ పాలనే రావాలని నినాదాలు చేశారు.రైతు బంధు లేదు.. 500 బోనస్ అన్నరు అది బోగస్ అయింది.. మేము పండించి కల్లంల పోసిన ధాన్యాన్ని కొంటలేరు.. ఇగ బోనస్ ఏమిస్తారు సార్””.. కాంగ్రెస్ పాలన అంత బోగస్ పాలన అయ్యింది.” అని రైతన్నలు గోడువెళ్లబోసుకున్నారు.

“పోరాడి సాధించుకుందాం నీళ్లు కరెంటు మల్లా తెచ్చుకుందాం పోరాటానికి సిద్ధంగా ఉండండి” అని కేసిఆర్ పిలుపునిచ్చారు. అంతకుముందు అన్నెపర్తి దగ్గెర కేసీఆర్ ను ఆపి ఇదే తరహాలో తమ గోడు వెల్లబోసుకున్నారు రైతన్నలు.

Read more RELATED
Recommended to you

Latest news