శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ టూ తిరుపతి వన్ డే టూర్ ఫ్యాకేజీ..!

-

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే ఏడుకొండల వారిని దర్శించుకోవాలనే కోరిక ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో టైం కుదరకనో లేక రెండు రోజుల ప్రయాణం కోసం సెలవులు దొరక్కనో ఆగిపోతుంటారు. ఈ నేపధ్యంలోనే తెలంగాణలోని శ్రీవారి భక్తులకు తెలంగాణ టూరిజం శాఖ గుడ్ న్యూస్ చెబుతూ ఓ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. తిరుపతికి వన్ డే టూర్ ప్యాకేజీ ప్లాన్ చేసి దానికి సంబందించిన వివరాలను వెల్లడించింది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న వారిని ఫ్లైట్ లో తిరుపతికి తీసుకెళ్లి స్వామివారి దర్శనంతో పాటు తిరుచానూర్ పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చేయించి సాయంత్రానికి మళ్లీ ఫ్లైట్ లో హైదరాబాద్ చేరుస్తారు. ఈ తిరుపతి వన్ డే ప్యాకేజీ టూర్ యొక్క పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్ లో ఉదయం 6.55 గంటలకు ఫ్లైట్ ఎక్కితే 8 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • రేణిగుంట నుంచి తిరుపతి హోటల్ కు కారులో తీసుకెళ్తారు. ఫ్రెషప్ అయిన తరువాత తిరుమలకు మళ్లీ కారులో బయలుదేరాలి.
  • మధ్యాహ్నం 1గంట సమయానికి తిరుమలలో శ్రీవారి దర్శనం పూర్తి అవుతుంది. అనంతరం తిరుపతి చేరుకుంటారు.
  • ఓ గంట విశ్రాంతి తరువాత తిరుచానూర్ లో పద్మావతి అమ్మవారిని దర్శించుకొని మళ్లీ ఎయిర్ ఫోర్ట్ కి బయలుదేరాలి.
  • సాయంత్రం 6.35 గంటలకు రేణిగుంట నుంచి బయలుదేరి రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో ఈ వన్ డే ఫ్యాకేజీ టూర్ ముగుస్తుంది.
  • తిరుపతి వన్ డే ఫ్లైట్ టూర్ ఫ్యాకేజీ ధర ఒక్కొక్కరికీ 12వేల 499 రూపాయలుగా తెలంగాణ టూరిజం శాఖ నిర్ణయించింది. ఈ ఫ్యాకేజీలో ఫ్లైట్ టికెట్, కారు ట్రావెల్ ఛార్జెస్, రెండు చోట్ల ప్రత్యేక దర్శనాలు కవర్ అవుతాయి. దీంతోపాటు తెలంగాణ టూరిజం మరో ఫ్యాకేజీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రోజుల తిరుపతి టూర్ ఫ్యాకేజీ.. దీని ధర రూ. 15,499గా ఉంది. ఈ ఫ్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలు www.touism.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news