7th Pay Commission :ఉద్యోగులు 2 లక్షల వరకు డీఏ బకాయిలను పొందే అవకాశం..

-

7th Pay Commission అనే పదం గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తోంది.డీఏ కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు త్వరలో శుభవార్త అందుకోనున్నట్టు తెలుస్తుంది. 18 నెలల నుండి DA బకాయిల కోసం వేచి ఉంటున్న నేపథ్యంలో త్వరలో దీనిపై క్లారిటీ రానుందని తెలుస్తుంది..అయితే ఉద్యోగులకు డీఏ తో కలిపి 2 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నారు..

జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు ఆగిపోయిన డీఏ ఇవ్వాలని ఉద్యోగుల నుంచి చాలా కాలంగా డిమాండ్ ఉంది. ప్రభుత్వం త్వరలో డీఏ బకాయిలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.. జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు ఆగిపోయిన డీఏ ఇవ్వాలని ఉద్యోగుల నుంచి చాలా కాలంగా డిమాండ్ ఉంది. ప్రభుత్వం త్వరలో డీఏ బకాయిలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.

బకాయి ఉన్న డీఏ ఇవ్వాలని పలు ఉద్యోగుల సంఘాల నేతలు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. కరోనా కారణంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ మే 2020లో 30 జూన్ 2021 వరకు డీఏ పెంపును నిలిపివేసింది.చాలా కాలంగా బకాయి ఉన్న డీఏ, డీఏ ఎంత వస్తుందనే విషయమై ఉద్యోగుల్లో నిత్యం చర్చ సాగుతోంది. లెవల్ 1 ఉద్యోగుల డీఏ బకాయిలు రూ.11880 నుంచి రూ.37000 మధ్యలో ఉంటాయి. అదే విధంగా లెవల్ 13 ఉద్యోగులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 డీఏ బకాయిలు అందుతాయి..

మార్చి 2022లో AICPI ఇండెక్స్‌లో జంప్ జరిగింది, ఆ తర్వాత ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ (DA)ని 3 కాదు 5 శాతం పెంచడం ఖాయం. ఇది ఆమోదం పొందితే, ఉద్యోగుల డీఏ 34 శాతం నుంచి పెరుగుతుంది. 39 శాతానికి.జీతం ఎంత పెరుగుతుంది : రూ. 56,900 ప్రాథమిక వేతనం ఉన్న ఉద్యోగులకు 39 శాతం డియర్‌నెస్ అలవెన్స్ ఉంటే వారికి రూ.21,622 డీఏ లభిస్తుంది. ప్రస్తుతం 34 శాతం చొప్పున రూ.19,346 అందుతోంది. డీఏ 4 శాతం పెంపుతో జీతం రూ.2,276 పెరుగుతుంది.ఏడాదికి దాదాపు 28 వేల వరకూ పెరగనుంది..

Read more RELATED
Recommended to you

Latest news