ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం, ఆపై గొంతు కోసి..

-

దేశ రాజధాని దిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో ఉన్న ఓ ఎనిమిదేళ్ల చిన్నారిని అపహరించి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ 36 ఏళ్ల కిరాతకుడు. ఆ తర్వాత ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా చిన్నారి మృతదేహాన్ని యుమునా నది ఒడ్డున పడేశాడు ఆ నర హంతకుడు.

బాధితురాలు తల్లిదండ్రులు రోజువారీ కూలీ పనులకు వెళ్తుంటారు. ఆగస్టు 5వ తేదీన నిందితుడు చిన్నారిని కిడ్నాప్​ చేశాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత చిన్నారి ముఖాన్ని ఛిద్రం చేసి యమునా నది ఒడ్డున పడేసి వెళ్లిపోయాడు.

అయితే తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆగస్టు 18న యుమనా నది సమీపంలో గడ్డి కోయడానికి వెళ్లిన మహిళలు.. చిన్నారి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు వైద్యులు తెలిపారు. గాలింపు చర్యలను వేగవంతం చేసిన పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news