లిక్కర్ స్కామ్ లో కేసీఆర్‌ కుటుంబ ప్రమేయం : బండి సంజయ్

-

దిల్లీ మద్యం కుంభకోణం అంశం తెలంగాణలో కాకరేపుతోంది. ఈ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత కూడా భాగమైనట్లు ఆరోపణలు రావడంతో విపక్షాలు విమర్శల జల్లు కురుపిస్తున్నాయి. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీలు తెరాసపై మాటల దాడికి తెగబడ్డాయి. తాజాగా ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.

దిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్‌ కుటుంబానికి ప్రమేయం ఉందని బండి సంజయ్‌ ఆరోపించారు. సీఎం పదేపదే దిల్లీకి వెళ్లి చేసింది లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారాలేనని విమర్శించారు. ప్రజాసంగ్రామా యాత్రలో భాగంగా సీఎం కేసీఆర్​ని ఉద్దేశించి విమర్శలు చేశారు. తెలంగాణలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం 30 వేల కోట్లకు పెరిగిందని..ఈ స్కామ్‌పై సీఎం కేసీఆర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు.

ఈ వ్యవహారంపై విచారణ జరిపి అన్ని విషయాలు బయటపెడతామని బండి స్పష్టం చేశారు. రామచంద్ర పిళ్లై, శరత్, సృజన్ రెడ్డి, అభిషేక్​లు కేసీఆర్ బినామీలని బండి సంజయ్ ఆరోపించారు. దమ్ముంటే కేసీఆర్ సమాధానం చెప్పాలని సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news