బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. ఘటన స్థలంలో సూసైడ్ నోట్..!

-

బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బాయ్స్ హాస్టల్-1 లో పియుసి-2 చదువుతున్న విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు గదిలో లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

చనిపోయిన విద్యార్థిని రంగారెడ్డి జిల్లా మంచాల్ కు చెందిన భాను ప్రసాద్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం విద్యార్థి మృతదేహాన్ని బాసర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి మృతి పట్ల వీసి వెంకటరమణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి వ్యక్తిగత కారణాలతోనే చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ లభించిందని విసి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news