ఈ వీడియోను చూస్తే జీవితంలో సమోసా జోలికి వెళ్లరు..దేవుడా..

-

జనాలు కరోనా భయం నుంచి బయట పడ్డారు.. గత రెండేళ్ళు ఇళ్ళకే పరిమితం అయిన వాళ్ళు ఇప్పుడు టూర్ లు వేసుకుంటూ ఫ్యామిలితో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల కు వెల్లాలంటే మాత్రమే ఎక్కువ శాతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు.. ఫ్యామిలి మొత్తం వెళ్లాడానికి సౌకర్యంగా ఉండటానికి ఈ మార్గం బెస్ట్ అని చెప్పాలి..అయితే, ఎక్కువ మంది భోజనాన్ని కూడా కలిపి తీసుకుంటారు..కొన్ని సార్లు ప్రభుత్వ కేటరింగ్ కాబట్టి భోజనం అంత సరిగ్గా ఉండదు. మరి కొన్ని సార్లు స్టాక్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా సప్లై చేస్తారు..అవి పాడై పోవడంతో ప్రయాణీకులు అనేక ఇబ్బందులు పడతారు..ప్రయాణాల్లో దోపిడీ కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఛార్జీల పేరుతో ప్రయాణికుల్ని బాదేస్తారు. ప్రభుత్వ రవాణా సంస్థలైతే సమయాపాలన లేకుండా జనాలను ఇబ్బంది పెడతారు.

సురక్షితమైన ప్రయాణం చేయవచ్చని భావించే వారికి రైళ్లలో ఆహార పదార్ధాలు, తినుబండారాలు విక్రయించే వాళ్ల రూపంలో దోపిడీ చేస్తుంటారు. ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ లో లాంగ్ జర్నీ చేస్తున్నారా. అయితే ట్రైన్‌లో ఏదైనా తినే పదార్ధాలు విక్రయించడానికి వస్తే వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయండి..డబ్బుతో జబ్బులను కొని తెచ్చుకున్న వాళ్ళము అవుతాము..విషయానికొస్తె..మధ్యప్రదేశ్‌లో దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో విచిత్రమైన సంఘటన జరిగింది.

రైల్వే క్యాంటిన్‌లో తయారు చేసిన ఆలు సమోసాలు అమ్మేందుకు వచ్చాడు ఓ వ్యక్తి.ఆకలితో ఉన్న ప్రయాణికులు సమోసాలు కొనుగోలు చేశారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే ట్రైన్‌లో అమ్ముతున్న ఆలుగడ్డ సమోసాలో ఆలుగడ్డలు లేకుండా కేవలం ముక్కిపోయిన బియ్యం మిగిలినపోయిన అన్నం పెట్టి తయారు చేసినట్లుగా ఉన్నాయి..నాగ్‌పూర్‌ వెళ్తున్న ఇద్దరు యువకులు సమోసాలు కొనుగోలు చేశారు. తినడానికి వాటిని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే ఆలుగడ్డ సమోసాలో ఆలుగడ్డలకు బదులు ముక్కిపోయిన బియ్యంతో చేసిన అన్నం పెట్టి తయారు చేశారు. సమోసాల్లో ఉన్న పదార్ధం చూసిన యువకులు సమోసాలు విక్రయించే వ్యక్తినిపై మండిపడ్డారు.. ఈ గొడవను ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం తో అది వైరల్ అయ్యింది..అందుకే సుమీ ఎక్కడైనా వెళితే తినడానికి ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి..

Read more RELATED
Recommended to you

Latest news