IPL 2022 : ఢిల్లీలో బౌలర్ కు కరోనా… ఇవాళ జరిగే మ్యాచ్ రద్దు !

-

నేడు చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య 55 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ ముంబై లోని Dr DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరుగనుంది. అయితే  ఈ నేపథ్యంలోనే   ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరోసారి కరోనా కలకలం రేపుతోంది.

ఢిల్లీ జట్టులోని ఓ నెట్ బౌలర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు అందరిని ఐసోలేషన్ లో ఉంచింది జట్టు యాజమాన్యం. అయితే ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్ పై సందిగ్ధత నెలకొంది. కాగా ఈ సీజన్లో ఢిల్లీ జట్టు లో కరోనా సోకడంతో ఇది రెండోసారి కాగా అప్పుడు ఆటగాళ్లకు నెగిటివ్ కావడంతో ఆయా మ్యాచ్లను యధావిధిగా నిర్వహించారు. కాగా ఇప్పుడు హైదరాబాద్ జట్టు మరియు బెంగుళూరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news