గెస్ట్ హౌజ్ లో బాలికపై లైంగిక దాడి..వైసీపీ ప్రజాప్రతినిధుడిపై కేసు నమోదు !

-

ఏపీలోని గుంటూరు కు చెందిన ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నే, ఏపీ ఫిషర్‌ మెన్‌ కో – ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ కొండూరు అనిల్‌ బాబు ఉన్నారని ఆ బాధిత బాలిక తండ్రి ఎస్సీ కమిషన్‌ కు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను అనిల్‌ తన గెస్ట్‌ హౌజ్‌ కు తీసుకెళ్లి…. లైంగిక దాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు.

ఈ విషయం ఎవరికైఆన చెబితే చంపేస్తానని బెదిరించడటంతో.. తన కుమార్తె భయపడి, విచారణ సమయంలో ఆయన పేరు చెప్పలేదని.. తాజాగా ఎస్సీ కమిషన్‌ కు చెప్పారు ఆ తండ్రి. దీనిపై కమిషన్‌ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

గతంలో ఆ బాలిక కోర్టు, పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చిన స్టేట్‌ మెంట్‌ లో గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎంపీ ప్రధాన అనుయాయుడు ఉన్నా భూశంకర్‌ ఉండటంతో ఆయనను ఆరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో నెల్లూరు జిల్లా కు చెందిన వైసీపీ పార్టీ నేత అనిల్‌ బాబు ఉన్నారని బాలిక తండ్రి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news