ప్రియుడితో కన్న తల్లి నగ్నంగా రాసలీలలు..అడ్డుగా ఉన్న కూతురిని !

-

ప్రియుడితో తన రాసలీలలకు అడ్డుగా ఉన్న కన్న కూతురిని హత్య చేసింది ఓ కసాయి తల్లి. ఈ సంఘటన ఏపీలో కలకలం రేపింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… బద్వేలు మండల పరిధిలోని లక్ష్మీపాలెం గ్రామానికి చెందిన గానుగ పెంట వెంకటయ్య, రమణమ్మల కుమార్తె వెంకట సుజాత {17} ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం వరకు చదివింది.

రమణమ్మ తమ గ్రామానికి చెందిన గానుగపెంట శ్రీను అనే వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకుంది. అయితే.. ఒక రోజు నగ్నంగా వారిద్దరూ ఉన్నది చూసింది సుజాత. దీంతో అక్కడే రమణమ్మ కు వార్నింగ్‌ ఇచ్చింది సుజాత. ఇలాంటి పనులు ఏంటి అని మందలించింది. దీంతో ఎలాగైనా.. కుమార్తెను హత్య చేయాలని అనుకుంది రమణమ్మ. ప్రియుడు శ్రీను, సమీప బంధువైన ఆటో డ్రైవర్‌ మేకల కొండయ్యతో కలిసి కూతురిని హత్య చేసింది.

అయితే.. ఈ సంఘటన గతేడాది అక్టోబర్ 16 వ తేదీన జరిగింది. ఇక తన కూతురి మృత దేహాన్ని వ్యవసాయ బావిలో పడేశారు. తన భర్త తాగుడుకు సుజాత ఇంటి నుంచి పారిపోయినట్లు.. అందరిని నమ్మించింది. అయితే.. నిన్న ఈ కేసును పోలీసులు ఛేదించారు. వ్యవసాయ బావిలో పడేసిన సుజాత మృతదేహాన్ని బయటకు తీసి.. నిందితులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news