పిల్లల విషయంలో ఉపాసనపై ఫైర్ అవుతున్న ప్రముఖ డైరెక్టర్.. కారణం..?

-

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాపరెడ్డి మనవరాలు ఉపాసనను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా పిల్లలు కలగడం లేదు అనే విషయంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇక రాంచరణ్ తో పాటు పెళ్లి అయినా ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా ఇద్దరేసి పిల్లలకి జన్మనిచ్చి తమ ఫ్యామిలీతో సంతోషంగా జీవిస్తుంటే రామ్ చరణ్ ఎందుకు ఇంకా సినిమాలు అంటూ తిరుగుతున్నాడే తప్ప తన వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోవడం లేదు ఏంటి అంటూ కొంతమంది రకరకాల మాటలు కూడా అంటున్నారు.

ఇకపోతే ఈ విషయంపై క్లారిటీ తీసుకోవడానికి ఉపాసన సద్గురు దగ్గరికి వెళ్లి పిల్లలు కనడంపై ఉద్దేశాన్ని చెప్పమని అడగగా.. సద్గురు ఏకంగా పిల్లలను కనవలసిన అవసరం ఏముంది.. ఒకవేళ ఆడ పులి అయితే పులి పిల్లలకు జన్మనివ్వమని చెప్పేవాడిని.. ఎందుకంటే అంతరించిపోతున్న పులిజాతిని కాపాడాలంటే పులి పిల్లలకు జన్మనివ్వడం మంచిది. ఇక ఎక్కడ చూసినా పుట్టలు పుట్టలుగా మానవజాతి పెరిగిపోతున్న నేపథ్యంలో సమాజానికి మనం చేసే మేలు ఒకటే పిల్లలు అనే ఆలోచనకు దూరంగా ఉండడమే అని చెప్పారు. కానీ ఈ విషయంపై ఉపాసన స్పందిస్తూ మా అత్త , అమ్మ నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తాయి.. అప్పుడు సమాధానం చెప్పండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది

ఇక ఈ విషయంపై స్పందించిన ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ ఉపాసనపై ఫైర్ అవుతున్నారు. గీత కృష్ణ మాట్లాడుతూ పేదవారైనా, గొప్పింటి వారైనా తమ వంశంలో వంశాంకురాలు ఉండాలని ఆలోచించడంలో తప్పులేదు కదా.. ఇక ఎవరైనా సరే తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసిన తర్వాత వారసుల కోసం ఎదురు చూస్తారు.. ఇక చిరంజీవి, సురేఖ తమ వారసుల కోసం అడగడంలో తప్పులేదు కదా? నీవు ఈ విషయాన్ని నాలుగు గోడల మధ్యే చర్చించాల్సింది పోయి నలుగురిలో అతడి ముందు నోరు విప్పాల్సిన అవసరం ఏముంది.. అతడేవరు నిన్ను పిల్లలను కనవద్దు అని చెప్పడానికి.. కుటుంబ పరువును మొత్తం ఉపాసన తీస్తోంది అంటూ ఆమె పై ఫైర్ అయ్యాడు

Read more RELATED
Recommended to you

Latest news