హైదరాబాద్ లో మరో మహిళపై లైంగిక దాడి.. క్యాబ్ లో కిడ్నాప్ చేసి మరి !

-

హైదరాబాద్ లో జరిగిన మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ ను ఓ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. ఆ బాలికను ఓ రాత్రంతా వేరే చోట ఉంచి తిరిగి విడిచిపెట్టాడు. ఇందుకు సంబంధించి సదరు క్యాబ్ డ్రైవర్ సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటికి రాగా పోలీ సులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.

మొగల్ పురా పీఎస్ పరిధికి చెందిన ఓ బాలిక నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. బాలిక కోసం గాలించిన కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి మొగల్పురా పీఎస్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరుసటి రోజే ఆ బాలిక ఇంటికి తిరిగి వచ్చింది. ఆ బాలికను విచారించగా.. లుక్మాన్ అనే క్యాబ్ డ్రైవర్ తనను రంగారెడ్డి జిల్లాలోని ఏదో ఊరికి తీసుకెళ్లాడని చెప్పింది. దీంతో మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా మార్చిన పోలీసులు వెంటనే లుక్మాన్ ను అదుపులోకి తీసుకున్నారు. బాలికను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ గ్రామా నికి తీసుకెళ్లానని, అక్కడ తనకు తెలిసిన వ్యక్తులు తమకు ఆశ్రయమిచ్చారని పోలీసు విచారణలో లుక్మాన్ వెల్లడిం చాడు. వెంటనే లుక్మాన్కు ఆశ్రయమిచ్చిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడానికి కారణమేంటి, అసలు ఆ రాత్రి కొందుర్గ్ ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news