ఇంద్రకీలాద్రి అమ్మవారి ప్రసాదంలో అపచారం చోటు చేసుకుందని. విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై కొలువైన కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో మేకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.
మహా మండపం కింద 4వ కౌంటర్లో పులిహోర పొట్లాలు కొనుగోలు చేసిన భక్తులు ఆ ప్రసాదం తింటుండగా మేకు రావడంతో షాక్ అయ్యారు. అపరిశుభ్రంగా అమ్మవారి ప్రసాదం తయారు చేస్తున్నారని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.