ధూళిపాళ్ళకు బెయిల్ నిజమా…?

-

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర బెయిల్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు బెయిల్ వచ్చింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్ లు వచ్చాయి. అయితే అది నిజం కాదని తెలిసింది. మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైల్ కు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను అధికారులు తరలించారు. కరోనా కారణంగా విజయవాడ ఆయూష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ధూళిపాళ్ల నరేంద్రను…

నెగటివ్ రావడంతో రాజమండ్రి తరలించారు. ధూళిపాళ్ల నరేంద్ర వారం రోజులు ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు సూచించారు. జైల్లోనే ఐసోలేషన్ లో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ కోసం ఏపీ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు. నరేంద్ర కస్టడీని రీ కాల్ చేయాలని ఏసీబీ కోర్టులో నరేంద్ర తరపు న్యాయవాదులు పిటీషన్ దాఖలు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news