తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం..!

-

తమిళనాడు రాష్ట్రంలోని టపాకాయల తయారీకి ప్రసిద్ధి చెందిన శివకాశీలో గురువారం భారీ పేలుడు సంభవించింది. వివరాల్లోకి వెళ్లితే.. బాణసంచా తయారీ కేంద్రంలో ముడి సరుకును లోడ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు భారీ విస్పోటనం జరిగింది. ఈ ప్రమాదంలో పేలుడు ధాటికి మొత్తం ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు.

అందులో ఐదుగురు మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే మంటలు అదుపు చేస్తున్నప్పటికీ కర్మగారంలో మందుగుండు సామాగ్రి ఎక్కువగా ఉండటంతో మంటలు పైకి ఎగిసి పడుతున్నాయి. ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే విషయం మాత్రం తెలియదు. విచారణలో తెలియజేయనున్నట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news