వేములవాడ రాజన్న సన్నిధిలో ఘోర అగ్ని ప్రమాదం

-

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేములవాడ పట్టణం లోని జాతర గ్రౌండ్ ఏరియా లో ఆలయ వసతి గదుల సముదాయంలో అగ్ని ప్రమాదం జరిగింది. గదులో నిల్వచేసిన (ఆరబెట్టిన) కొబ్బరి చిప్పలకు ప్రమాదవశాత్తూ అంటుకున్నాయి మంటలు. ఈ ప్రమాదం నేపథ్యంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.

పొగ వ్యాపించింది. దీంతో మంటలు అర్పుతున్నారు స్థానికులు. ఫైర్ ఇంజన్ అందుబాటులో లేకపోవడంతో..మంటలు అర్పుతున్నారు స్థానికులు. వేములవాడ రాజన్న ఆలయంలో వేలం ద్వారా టెండర్ దక్కించుకున్న కాంటాక్టర్ కి సంబంధించిన కొబ్బరి ముక్కల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news